ఆసుపత్రిలో సుద్దాల అశోక్ తేజ.. అసలేమైంది ?

ప్రముఖ గేయ రచయిత సుద్ధాల అశోక్ తేజ అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కాలేయ సంబంధిత సమస్యతో గచ్చిబౌలిలోని ఏషియన్ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతున్నారు. అశోక్ తేజకి కాలేయ మార్పిడి చికిత్స చేయనున్నట్టు తెలిసింది. ఇందుకోసం రక్తాన్ని సేకరించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది.

అశోక్ తేజ బ్లడ్ గ్రూప్ బి-నెగటివ్. అరుదైనా ఈ బ్లడ్ గ్రూప్ రక్తాన్ని ముందుగానే సేకరించి పెట్టుకొంటున్నారు. సుద్దాల అశోక్ తేజ ఎన్నో అందమైన పాటలు రాశారు. ‘ఠాగూర్’ సినిమా కోసం ఆయన రాసిన ‘నేను సైతం.. ‘ పాట తెలుగు సినిమా ఉన్నంతవరకు గుర్తుండిపోయే పాటల జాబితాలో చేరింది.