తలసానితో టాలీవుడ్ చర్చలు

మూడు, నాల్గో విడతల లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా తెలంగాణలో పలు రంగాలకి మినహాయింపు లభించింది. అయితే సినీ పరిశ్రమకి మాత్రం మినహాయింపు లభించలేదు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖలంతా సమావేశం కానున్నారు. షూటింగ్స్ అనుమతి, థియేటర్స్ ఓపెన్, సినీ పరిశ్రమకి సంబంధించి లాక్‌డౌన్ నిబంధనలపై చర్చించనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం దృష్టికి సమస్యలని తీసుకెళ్లనున్నారనే ప్రచారం జరిగింది. ఇవన్నీ జరిగాయో.. లేదో తెలియదు. కానీ తాజాగా మంత్రి తలసానితో సినీ ప్రముఖులు సమావేశం అయ్యారు. చిరంజీవి నివాసంలోనే ఈ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి చిరంజీవి, నాగార్జునతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్‌బాబు, సి.కల్యాణ్, దిల్‌రాజు, జెమిని కిరణ్‌, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, దర్శకుడు రాజమౌళి, వి.వి వినాయక్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఎన్‌.శంకర్‌, కొరటాల శివ తదితరులు హాజరయ్యారు.
సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి తలసాని.. షూటింగ్స్, థియేటర్స్ కు అనుమతి విషయంపై సీఎం కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సినీ పరిశ్రమకి ఏ సాయం కావాలన్నా చేస్తామన్నారు.