టిక్ టాక్ చేసిన గొర్రెల కాపరి అరెస్ట్

టిక్ టాక్ మోజులో పడి యువత ప్రాణాలని కోల్పోయిన ఘటనలు చూశాం. ఈ నేపథ్యంలో ఇండియాలో టిక్ టాక్ ని బ్యాన్ చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ మేరకు కేంద్రానికి విజ్ఝప్తులు అందుతున్నాయి. ఇదిలావుంటే తాజాగా ఓ యువకుడు అడవి జంతువులతో టిక్ టాక్ చేసి జైలు పాలయ్యాడు.

అనంతపురం జిల్లాకు చెందిన ఓ యువకుడు గొర్రెల కాపరిగా పని చేస్తున్నాడు. ఈ నేసథ్యంలో ప్రతిరోజు అడవికి వెళ్ళేవాడు. అయితే అక్కడ ఓ జింక పిల్ల కనిపించడంతో దానిని బందించి దానితో టిక్ టాక్ చేశాడు. ఓ కుందేలును చంపి దాని మాంసాన్ని కుక్కలకు వేసాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. దాంతో పాటు ఈ వీడియోలు ఫారెస్ట్ అధికారుల కంట పడ్డాయి.  దీంతో ఆ యువకున్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.