ఏపీ, తెలంగాణ.. చెరో 62 కేసులు !

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. శుక్రవారం ఏపీ, తెలంగాణలోనూ 62 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,667కి చేరింది. మరో 55 మంది కరోనాతో మృతి చెందారు. ఇక తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,761కి చేరింది. మరో 48మంది మృతి చెందారు.

తెలంగాణలో కొత్తగా నమోదైన కేసులు 61 జీహెచ్ ఎంసీ పరిధిలో, ఒక్క కేసు మాత్రం రంగారెడ్డిలో నమోదైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే ఏపీతో పోలిస్తే తెలంగాణలో కరోనా టెస్టుల సంఖ్య తక్కువగా ఉంది.