పాక్ ప్లేన్ క్రాష్ వీడియోలు.. చూశారా ?

పాకిస్థాన్‌లోని కరాచీలో కుప్పకూలిన విమాన ఘటనలో మృతుల సంఖ్య 97కి చేరుకుంది. ఇప్పటికే 76 మృతదేహాలని వెలికి తీశారు. సాంకేతిక లోపం వల్లే ఎయిర్ బస్ కుప్పకూలినట్లు నిర్ధారించారు. ప్రమాదానికి ముందే రెండు ఇంజిన్లు మెరాయించాయని పైలెట్ తెలిపారు. బెల్లీ ల్యాండింగ్ చేస్తావా ? అని అధికారులు అడిగారు. అయితే అది పైలెట్ కు అర్థం కాలేదు.

విమానం కుప్పకూలేముందు పైలెట్ సాయం కోసం మేడే మేడే అని అరుస్తూ కంట్రోల్ రూంకు సిగ్నల్ పంపారు. ఆ సందేశం రాగానే కమ్యూనికేషన్ దెబ్బతింది. పైలెట్ కంట్రోల్ రూమ్ తో మాట్లాడిన వాయిస్ ఓవర్ వీడియోలు, విమానం కూలే సన్నివేశాలు ఓ ఇంటిపై ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.