కరణ్ ఇంట్లో ఇద్దరికి కరోనా 

మహమ్మారి కరోనాకి సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడానే లేడు. కాటేసిందంటే.. కాటికిపోయే పరిస్థితి. ఇప్పటికే పలువురు హాలీవుడ్, బాలీవుడ్.. ప్రముఖులు కరోనా బారినపడ్డారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరోణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా కరోణ్ నే తెలిపారు. త‌న ఇంటి స్టాఫ్ ఇద్ద‌రికి క‌రోనా నిర్ధార‌ణ అయిన‌ట్టు ఆయ‌న ట్విట్ చేశారు.

“ఇంటి సిబ్బందిలో ఇద్ద‌రికి క‌రోనా పాజిటివ్ అని నిర్థార‌ణ కాగానే వెంట‌నే ముంబై మున్సిపాల్ కార్పోరేష‌న్‌కి స‌మాచారం ఇచ్చాం. సిబ్బంది వ‌చ్చి మా ఇంటిని, చుట్టు ప‌క్క‌న ప్రాంతాన్ని కెమిక‌ల్ స్ప్రే చేశారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం మా ఇంట్లో వాళ్లంద‌రం రానున్న 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంటాం. క‌రోనా సంక్షోభంలో ప్ర‌తీ ఒక్క‌రం ప్ర‌భుత్వ నిబంధ‌న‌లను పాటిస్తే క‌రోనాను దీటుగా ఎదుర్కోవ‌చ్చు. కాబ‌ట్టి అంద‌రూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి”  అంటూ క‌ర‌ణ్ ట్వీట్  చేశారు.

‘బాహుబలి’ని బాలీవుడ్ లో రిలీజ్ చేసింది కరణ్ నే. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘ఫైటర్’ ని హిందీలో కరణ్ నే నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నారు.