‘నిశ్శబ్ధం’ సెన్సార్ రిపోర్ట్

హేమత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘నిశ్శబ్ధం’. ఈ సినిమాలో స్వీటీ ఇంతవరకూ చేయనటువంటీ మూగ, చెవిటి పాత్రలో కనిపించనుంది. మాధవన్, అంజలి, హాలీవుడ్ నటుడు మ్యాడ్‌సన్, షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ఈ విషయాన్ని దర్శకుడు హేమత్ మధుకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సినిమా అద్భుతంగా ఉందని సినిమా చూసిన సెన్సార్ సభ్యులు కితాబిచ్చారు. అంతేకాదు.. సినిమాని ఫస్ట్ థియేటర్స్ లో రిలీజ్ చేయమని సలహా ఇచ్చారు. వారికి ధన్యవాదాలు అంటూ హేమత్ ట్విట్ చేశారు.

రిలీజ్ కి రెడీ అయిన నిశ్శబ్ధం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇంతలో ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఓటీటీ రిలీజ్ పై చర్చలు జరుగుతున్నాయ్. కానీ ఇంకా ఫైనల్ కాలేదు. అయితే సినిమాని ఫస్ట్ థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలన్న సెన్సార్ బోర్డ్ సూచనని పాటిస్తారా ? అన్నది చూడాలి. ఎందుకంటే ? సినిమా అంటే బోలేడు ఆర్థిక వ్యవహారాలుంటాయ్. ఇప్పట్లో థియేటర్స్ తెరచుకోకుంటే.. ఓటీటీలో రిలీజ్ చేయక తప్పకపోవచ్చు. కానీ, నిశ్శబ్ధం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ని థియేటర్స్ లో చూస్తేనేమజా. అదే విషయాన్ని సెన్సార్ బోర్డ్ సభ్యులు చెప్పారు.