ప్రభాస్ సినిమాకి రెహమాన్ సంగీతం ?

బాహుబలి ప్రభాస్ ప్రస్తుతం రాథాకృష్ణ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇదో ప్రేమకథా చిత్రమ్. పూజా హెగ్డే హీరోయిన్. పునర్జన్మల నేపథ్యంలో ఉండనుందని చెబుతున్నారు. ఇందులో పూజా పంతులమ్మగా కనిపించనుంది చెబుతున్నారు. లెటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? ఈ సినిమా కు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారట.

సాహో తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ఇది. పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. లవ్ స్టోరీ కావడం, రెహమాన్ సంగీతం సంగీతం అందిస్తున్నారనే న్యూస్ ప్రభాస్ అభిమానులని ఆనందానికి గురి చేస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఉండనుంది. సైన్స్ ఫిక్షన్ కథతో ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది కూడా పాన్ ఇండియా సినిమానే.