కరోనా మరో షాకింగ్ న్యూస్

కరోనా వైరస్ ప్రపంచదేశాలని వణికిస్తోంది. ఈ మహమ్మారికి మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ మహమ్మారి గురించి రోజుకో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. ఈ వైరస్ రోజురోజుకి తన స్వభావం మార్చుకుంటోంది. సైంటిస్టులకు కరోనా పెద్ద మిస్టరీగా మారింది. కంటికి కనిపించని ఈ శత్రువు గురించి అంతుచిక్కని రహస్యాలు ఎన్నో వెలుగులోనికి వస్తున్నాయి. 

కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే కరోనా పాజిటివ్ గా తేలుతోంది. గాలిలో కొంత దూరం ఈ వైరస్ పయణిస్తుందని తేలింది. ఇంట్లోనే ఉన్నవారికి ఈ వైరస్ సోకుతుంది. అదెలా అన్నది అంతు పట్టడం లేదు. తాజాగా మరో షాకింగ్ న్యూస్ వెలుగుచూసింది. కరోనా బారిన పడిన ఇద్దరు మహిళల్లో 80 రోజుల తర్వాత కూడా కొవిడ్ వైరస్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది. క్వీన్స్ ల్యాండ్ లో ఈ ఘటన జరిగింది.