కోహ్లీ.. అనుష్కకు విడాకులివ్వాలి !

ఇదేదో సరదా కామెంట్ కాదు. సీరియస్ కామెంట్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దేశ భక్తుడు.. ఆయన తన భార్య అనుష్క శర్మకి విడాకులివ్వాలని బీజేపీ ఎమ్మెల్యే నంద్‌కిశోర్ గుర్జార్ చేశారు. అనుష్క నిర్మించిన ‘పాతాల్‌లోక్’ వెబ్‌సిరీస్ వివాదాస్పదం అయింది. పాతాల్‌లోక్ వెబ్‌సిరీస్‌లను జాతి వ్యతిరేక షో అని గుర్జార్ ఆరోపించారు. అంతేకాదు.. అనుష్క శర్మపై దోశద్రోహం కేసు కూడా పెట్టారు.

”దేశానికంటే ఎవరు గొప్ప కాదు. విరాట్ దేశం కోసం ఆడుతాడు.. అతను దేశ భక్తుడు. అందుకు వెంటనే అతను అనుష్కకు విడాకులు ఇవ్వాలి” అని గుర్జార్ అన్నారు. అంతేకాక.. ఈ సిరీస్‌ను వెంటనే రద్దు చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్‌కు లేఖ రాసినట్లు కూడా తెలిపారు. అయితే గుర్జార్ కామెంట్స్ పై ఇప్పటి వరకు విరాట్ కానీ, అనుష్క కానీ స్పందించలేదు. అయితే పాతాల్ లోక్ వెబ్ సిరీస్ అద్భుతంగా ఉందని ఇటీవల్ విరాట్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే.