APలో 68, TSలో 71 కొత్త కరోనా కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 58కి చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 2,787 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1913 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ప్రస్తుతం 816 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలోనూ మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 71 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో కరోనా కేసుల సంఖ్య 1991కి చేరింది. మంగళవారం 120 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1284 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 650 మంది చికిత్స పొందుతున్నారు. 51మంది కరోనా కారణంగా మృతి చెందారు.