సూర్యపేట జిల్లాలో తొలి కరోనా మరణం

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆ మధ్య రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్టే కనిపించింది. ఆ తర్వాత మళ్లీ విజృంభిస్తోంది. ప్రతిరోజు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇక సూర్యపేట జిల్లాలో తొలి కరోనా మరణం నమోదైంది. కాసరబాద గ్రామానికి చెందిన 4 నెలల బాలుడు కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతదేహాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖననం చేసే అవకాశం ఉంది. కరోనా పాజిటివ్‌తో పాటు బాలుడి గుండెకి హోల్‌ ఉందని వైద్యులు చెబుతున్నారు.

మంగళవారం తెలంగాణలో 71 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో కరోనా కేసుల సంఖ్య 1991కి చేరింది. మంగళవారం 120 మంది డిశ్ఛార్జ్ అయ్యారు.  ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1284 మంది డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 650 మంది చికిత్స పొందుతున్నారు. 51మంది కరోనా కారణంగా మృతి చెందారు.