కరోనాని జయించిన హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు

యుక్త వయసులో ఉన్నవాళ్లు కరోనా నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువ. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు అంత ఈజీగా కరోనా నుంచి కోలుకోరని వైద్యులు చెబుతున్నారు. ఆల్రెడీ ఇతర రోగాలతో బాధపడుతున్నవారు కరోనా సోకకుండా మరింత జాగ్రత్తగా ఉండాలి. వారికి కరోనా సోకితే బతికి బయటపడటం కష్టమని చెబుతున్నారు. అయితే ఇటీవల క్యాన్సిర్ రోగి కరోనాని జయించిన సంగతి తెలిసిందే. తాజాగా హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుడు కరోనా నుంచి కోలుకున్నారు. అది కూడా కేవలం ఆరు రోజుల్లోనే. ఇది అద్భుతమా ? లేక మరే కారణాలు ఉన్నాయా ? అని వైద్యులు పరిశోధనలు చేస్తున్నారు.

 ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్ కావడం లేదు. ఏపీలో ఇప్పటివరకు 2787 కరోనా కేసులు నమోదయ్యాయ్. 58 మంది మృతి చెందారు. ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1991కి చేరింది. 57మంది మృతి చెందారు. మంగళవారు తెలుగు రాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.