అర్జున్ రెడ్డి నటిని మోసం చేసిన నాయుడు ఫ్యామిలీ

ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు సోదరుడు శ్యామ్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఆయన, ఆయన ఫ్యామిలీపై అర్జున్ రెడ్డి నటి సాయి సుధా పోలీస్ కేసు నమోదు చేశారు. శ్యామ్ కె నాయుడు తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు. భార్యతో ఆయనకు తరచూ గొడవలు జరిగేవి. ఆమెకి విడాకులు ఇచ్చేసి.. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు.
 
తనని అన్నీ విధాలవాడుకున్నాడు. తనని తరచుకొట్టేవాడు. ఇక శ్యామ్ కె నాయుడు భర్త, కొడుకు తనకి ఫోన్ చేసి నీచంగా మాట్లాడేవారు. చోటా కె నాయుడు కూడా తనతో పలుమార్లు మాట్లాడారు. మొదట్లో తనని సపోర్ట్ చేసిన చోటా కె నాయుడు.. ఆ తర్వాత తన తమ్ముడి సేఫ్ జోన్లో ఉంచేసి తనకు హ్యాండిచ్చారని సాయి సుధా ఆరోపించారు.

శ్యామ్ కె నాయుడు ఫ్యామిలీ మొత్తంపైన కేసు నమోదు చేశానని తెలిపింది. ఫైనల్ గా శ్యామ్ కె నాయుడు నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే.. ? అతను తనకి కావాలని తెలిపింది. ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శ్యామ్ కె నాయుడుని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మొత్తానికి.. శ్యామ్ కె నాయుడు ఫ్యామిలీ ఏపీసోడ్.. సీరియల్ మాదిరిగా చాన్నాళ్లే నడిచేలా కనిపిస్తోంది.