లాక్ డౌన్ వేళ.. బుల్లితెర నటి ఆత్మహత్య !

కరోనా లాక్ డౌన్ తో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. బుల్లితెర నటి ప్రేక్షా మెహతా (25) కూడా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఈ క్రమంలో తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం షాక్ కి గురిచేస్తోంది. ప్రేక్షామెహతా సోమవారం రాత్రి పెట్టిన ఓ ఇన్ స్టా పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘కలలు చనిపోవడమే మన జీవితంలో చెత్త విషయం’ అంటూ ఆమె ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశారు. క్రైమ్ పెట్రోల్, లాల్ ఇష్క్, మేరీ దుర్గ సీరియల్స్ ప్రేక్షా మెహతాకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ప్రేక్షా మెహతా ఆత్మహత్యపై పోలీసులు మాట్లాడుతూ.. ‘బుల్లితెర నటి ప్రేక్షా మెహతా లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఇండోర్ లోనే కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు గురించి దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే వివరాలను వెల్లడిస్తాం’ అని తెలిపారు.