మహేష్ పై సర్కారు వేలం

సూపర్ స్టార్ మహేష్ బాబుని వేలానికి పెట్టాడు దర్శకుడు పరశురామ్. వీరి కలయికలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సర్కారు వారి పాట’ అనే విభిన్నమైన టైటిల్ ని పెట్టబోతున్నట్టు తెలిసింది. సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా ఈ నెల 31న ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని తెలుస్తోంది.

మహేష్ కోసం పరశురామ్ ఎమోషన్స్ బలంగా ఉండే..  ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథని రెడీ చేశాడనే ప్రచారం జరిగింది. ఇందులో మహేష్ కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ‘సర్కారు వారి పాట’ టైటిల్ మాత్రం పొలిటికల్ టచ్ తో కనిపిస్తోంది. మరీ.. పరశురామ్ మహేష్ తో కలిసి రాజకీయం చేస్తాడా ? లేక.. కడుపుబ్బ నవ్వుకొనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కిస్తారా ? అన్నది చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు ? ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.