బాలీవుడ్ నటి ఫ్యామిలీ మొత్తానికి కరోనా 

కరోనా మహమ్మారికి సామాన్యుడు, సెలబ్రిటీ అనే తేడానే లేదు. అందరికీ సోకుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కొందరు కరోనా నుంచి కొలుకొంటే.. మరికొందరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బాలీవుడ్ నటి కుమారి సింగ్‌తో సహా ఆమె కుటుంబం మొత్తానికి వైరస్ సోకిందని తేలింది. దీంతో వెంటనే వారిని ఐసోలేషన్‌కు తరలించారు.

కరోనా సోకిన విషయాన్ని స్వయంగా కుమారి సింగ్ నే సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆమె భర్త సుయేష్ రావత్, మామ సత్పాల్ మహారాజ్‌కు వ్యాధి సోకిందని చెప్పారు. త్వరలోనే కోలుకుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇంతకుముందు సింగర్ కనికా కపూర్ కరోనా బారినపడి కోలుకున్నారు. బోనీకపూర్ ఇంట్లో పనిచేసే వ్యక్తికి కరోనా సోకింది. ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ కరోనా కలవరంతో హోంక్వారంటైన్ లోకి వెళ్లిపోయారు.