మహేష్ హీరోయిన్.. ఇప్పట్లో ఫిక్స్ కాదు !

పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడుగా ‘సర్కారు వారి పాట’ రాబోతున్న సంగతి తెలిసిందే. బలమైన మేసేజ్ తో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఉంటుందని మహేష్ చెప్పాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ, పూజా హెగ్డే, సాయి మంజ్రేకర్, కీర్తి సురేష్ రేసులో ఉన్నారు.

అయితే వీరిలో ఎవరు అనేది ఇప్పట్లో తేలే పరిస్థితులు కనిపించడం లేదు. మహేష్ హీరోయిన్ మేటర్ తేలాలంటే ముందు షూటింగ్స్ మొదలవ్వాలి. ఆగిపోయిన సినిమాల రీ షెడ్యూల్ కావాలి. అప్పుడే మహేష్ హీరోయిన్ ఎవరు ? అనేది కన్ఫామ్ కానుంది. ఒక్క మహేష్ సినిమానే కాదు. మిగితా హీరోల సినిమాల పరిస్థితి ఇది. ఇక సర్కారు వారి పాటాని మైత్రీ మూవీస్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ సినిమా కోసం మహెష్ రెమ్యూనరేషన్ ఇంకా ఫిక్స్ కాలేదు. సినిమా రిలీజ్ టైమ్ లో ఉన్న పరిస్థితులని బట్టీ ఆయన రెమ్యూనరేషన్ ని ఫిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.