ప్రభుదేవాకి జంటగా నయన్

స్టార్ హీరోయిన్ నయనతార మాజీ ప్రియుడు ప్రభుదేవాతో జతకట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నయన్ ఖాతాలో రెండు ఫెల్యూర్ లవ్ స్టోరీలు ఉన్న సంగతి తెలిసిందే. మొదట శింబు, ఆ తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం నడిపింది నయన్. ఈ రెండు ప్రేమకథలు విఫలమయ్యాయ్. అయితే శింబుతో విడిపోయిన తర్వాత కూడా ఆయనకి జంటగా ఓ సినిమాలో నటించింది నయన్.

ఇప్పుడు అదే తరహా ప్రభుదేవా జంటగా నయన్ జతకట్టబోతుందనే ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రభుదేవా దర్శకత్వంలో ఈశ్వరీ నిర్మాతగా ‘కరుప్పు రాజా వెలై రాజా’ అనే చిత్రం మొదలైంది. విశాల్‌, కార్తీ ప్రధాన పాత్రల్లో కొంత షూటింగ్‌ జరుపుకున్న ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల రెండేళ్ల క్రితం నిలిచిపోయింది. ఇపుడు ఈ సినిమా తిరిగి ప్రారంభం కానుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నిర్మాత ఈశ్వరీ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని తేల్చి చెప్పారు. ఇప్పుడు ఆ సినిమాను పూర్తిచేయాలనే ఉద్దేశం నాకు లేదని క్లారిటీ ఇచ్చారు.