నేషనల్ ఇష్యూగా మారిన తారక్ ఫ్యాన్స్ రచ్చ

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల వ్యవహారం జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ‘బంగారం’ హీరోయిన్ మీరా చోప్రాని తారక్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ ఛాట్ చేసిన మీరా చోప్రాని.. ఓ నెటిజన్ ఎన్టీఆర్ గురించి స్పందించమని అడిగారు. దానికి మీరా.. నేను మహేష్ ఫ్యాన్ ని. తనకు ఎన్టీఆర్ గురించి తెలీదని సమాధానం ఇచ్చింది. దీంతో తారక్ ఫ్యాన్స్ మీరా చోప్రాని తగులుకున్నారు. ఏ రేంజ్ లో వేసుకున్నారు.

ఆ బాధని తట్టుకోలేక మీరా చోప్రా సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించింది. తారక్ అభిమానులు తనని వేధిస్తున్నారు. హింసిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై జాతీయ మ‌హిళా క‌మిష‌న్ కూడా స్పందించింది. మీరా చోప్రాకు పూర్తి స‌హ‌కారం అందిస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించింది. దీంతో తారక్ అభిమానుల రచ్చ నేషనల్ ఇష్యూగా టర్న్ తీసుకుంది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ జతకట్టనుంది. తారక్ బర్త్ డే (మే 20) కానుకగా ఆర్ ఆర్ ఆర్ నుంచి రామరాజు ఫర్ భీమ్ టీజర్ రావాల్సి ఉంది. అయితే కరోనా ఎఫెక్ట్ తో అది వాయిదా పడింది.