పవన్-క్రిష్ సినిమా లెక్క మారిపోయింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులని నాన్ స్టాప్ గా ఎంటర్ టైన్ చేద్దామని భావించారు. ‘వకీల్ సాబ్’ తో రీ ఎంట్రీ ఇస్తున్న పవన్.. ఆ వెంటనే క్రిష్ సినిమాని చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. హరీష్ శంకర్ తో సినిమాని లైన్ లో పెట్టేశాడు. అయితే కరోనా ఎఫెక్ట్ తో పవన్ స్పీడుకు బ్రేకులు పడ్డాయ్. షూటింగ్ లకి ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే వకీల్ సాబ్ సినిమాని పూర్తి చేస్తారు.

ఆ తర్వాత క్రిష్ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే క్రిష్ సినిమా పీరియాడిక్ సినిమా. ఈ సినిమా లో పవన్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడు. ఒకడు మంచి వాడు మరొకరు దొంగ. రాబిన్ హుడ్ టైపు స్టోరీ. ఈ సినిమాలో గ్రాఫిక్స్ పనులు ఎక్కువ వుంటాయి. అయితే పెద్దగా గ్రాఫిక్స్ అవసరం కాకుండా లోకేషన్స్ తో తక్కువ ఖర్చుతో పూర్తి చేయాలని క్రిష్ ప్లాన్ చేసుకున్నాడు.

గతంలో శాతకర్ణి సినిమాని ఇలాగే చేసారు. ఆ ఫార్ములానే పవన్ సినిమాకి వాడాలని నిర్ణయించుకున్నారు. అయితే పవన్ మాత్రం హైదరాబాద్ దాటి వచ్చేది లేదని చెప్పారట. అలా కుదరదు అంటే.. ముందు హరీష్ శంకర్ సినిమా పూర్తి చేసి.. ఆ తర్వాత క్రిష్ సినిమా చేద్దామనే ప్రపోజల్ పెట్టాడట. దీంతో క్రిష్ డోలాయమానంలో పడిపోయారు.