తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో కొత్త 143 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 8 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో రంగారెడ్డిలో 8, మహబూబ్ నగనగర్ లో 5, వరంగల్ లో 3, ఖమ్మం, ఆదిలాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో రెండు చొప్పున నమోదయ్యాయి. మంచిర్యాలలో 1 పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది.

తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,290కి చేరింది. ప్రస్తుతం 1,550 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. 1627 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 113 మంది మృతి చెందారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఈటెల లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాతే కరోనా కేసుల సంఖ్య పెరిగాయని తెలిపారు. ముంబై, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు, వలస కూలీలతో కరోనా కేసులు సంఖ్య భారీగా పెరిగిందని తెలిపారు. కరోనా నిర్థారణ సంఖ్య పెంచనున్నట్టు మంత్రి తెలిపారు.