అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం దంపతులకి కరోనా

కరోనా మహమ్మారి దేవుళ్లని మాత్రమే కాదు డాన్ లని వదిలి పెట్టడం లేదు. తాజాగా అండర్‌ వరల్డ్ డాన్, ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం, ఆయన భార్య కూడా కరోనా బారినపడ్డట్లు తెలిసింది. ప్రస్తుతం దావూద్‌ పాకిస్తాన్ ‌లోని కరాచీ సమీపంలో గల మిలటరీ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారని సమాచారమ్.

తొలుత దావ్యూద్ భార్య మెహజీబేన్‌కు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో దావూద్‌కు నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు సమాచారమ్. దావూద్ తో పాటు ఆయన సిబ్బందిలో మరికొందరికి కరోనా సోకినట్టు తెలుస్తోంది. భారత్ లో పలు విద్వంసాలకి కారకుడు దావూద్. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల ఆయన ప్రధాన నిందితుడు. దాదాపు 25 యేళ్ల నుంచి అండర్ గ్రౌండ్ లో ఉంటున్నారు. దావూద్ ని భారత్ కి అప్పగించాలని ఎన్ని ఒత్తిడులు తెచ్చినా పాకిస్థాన్ లొంగడం లేదు.