నెం.1 స్థానంలో ఎందుకు లేరు కేసీఆర్ ?


దేశంలో బెస్ట్ సీఎం ఎవరు ? సీఎం కేసీఆర్ అంటూ తెరాస నేతలు చాన్నాళ్ల నుంచి చెప్పుకుంటున్నారు. అయితే వారికి షాక్ ఇస్తూ.. ఇటీవల ఓ జాతీయ ఛానెల్ చేసిన సర్వేలో సీఎం కేసీఆర్ కు 16వ స్థానం దక్కింది. మొదటి స్థానంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఏపీ సీఎం జగన్ కి నాల్గో స్థానం దక్కింది. అయితే ఈ సర్వేపై తెరాస నేతలు సప్పుడు చేయడం లేదు.
 
తాజాగా సీఎం కేసీఆర్ కు 16వ స్థానం దక్కడంపై యాదాద్రి-భువనగిరి ఎంపీ కోమట్ రెడ్డి వెంటర్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ఓ సర్వేలో పదహారువ స్థానంలోకి ఎలా దిగజారారని కోమటిరెడ్డి విమర్శించారు. ఇక గందమల్ల రిజర్వాయర్ నిర్మాణము లేదని అధికారులే చెబుతున్నారు.  ఎన్నికల సమయంలో గందమల్ల రిజర్వాయర్ ఉందని ప్రజలను మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందరెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.