ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై యాక్షన్’కు ఆదేశించిన కేటీఆర్

తనని వేధించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి శిక్షపడే వరకు వదిలేలా లేదు హీరోయిన్ మీరా చోప్రా. తారక్ ఫ్యాన్స్ ఇష్యూని ఆమె ఇప్పటికే జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. ఈ వ్యవహారంపై జాతీయ మహిళా కమిషన్ స్పందించిన సంగతి తెలిసిందే.మీరా చోప్రాకు మద్దతు తెలిపింది. ఇక ఈ వ్యవహారాన్ని ప్రముఖుల దృష్టికి తీసుకెళ్లే పనిలో మీరా చోప్రా ఉంది.

తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ దృష్టికి తారక్ అభిమానుల వ్యవహారాన్ని తీసుకెళ్లింది. మీ రాష్ట్రం నుంచి తనకి బెదిరింపు వస్తున్నాయి. గ్యాంగ్ రేప్, యాసిడ్ దాడి.. చేస్తామని బెదిరిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలి. మహిళలకి రక్షణ కల్పించాలని ట్విట్టర్ వేదికగా కోరారు. మీరా ట్విట్ కు కేటీఆర్ స్పందించారు. మీరు ట్విట్ ని డీజీపీ, సీపీ షేర్ చేస్తూ చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేటీఆర్ స్పందనపై మీరా సంతోషం వ్యక్తం చేసింది. థ్యాంక్స్ చెప్పింది.