ఈ నెల 9న ఏపీకి టాలీవుడ్

టాలీవుడ్ ఏపీకి తరలిపోనుంది. అలాగని కంప్లీట్ గా కాదు. టాలీవుడ్ ప్రముఖులకి ఏపీ సీఎం జగన్ అపాయింట్ మెంట్ లభించింది. ఈ నెల 9న సీఎం జగన్ ని కలిసేందుకు టాలీవుడ్ ప్రముఖులు వెళ్లనున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వెళ్లాలి ? అనే జాబితా రెడీ అయినట్టు తెలుస్తోంది. ఎగ్జిబిటర్, ప్రొడ్యూసర్, స్టూడియా, డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుంచి ఇద్దరు ఇద్దరు వంతున వెళ్తున్నారు.

అలాగే ఫెడరేషన్, మా, డైరక్టర్ విభాగాల నుంచి ఇద్దరేసి వంతున వెళ్తున్నారని సమాచారమ్. డైరక్టర్ ల నుంచి రాజమౌళి, త్రివిక్రమ్, కొరటాల శివ వెళ్లే అవకాశం వుంది. చిరంజీవి, నాగార్జున వుంటారని తెలుస్తోంది. మా తరపున నరేష్, జీవిత వుంటారని వినిపిస్తోంది. ఇంతకీ సీఎం జగన్ తో సినీ ప్రముఖులు ఏం చర్చించనున్నారు ? అంటే.. షూటింగ్ లకి అనుమతి కాదు. ఏపీలో ఇండస్ట్రీ అభివృద్దిపై మాట్లాడతారని తెలుస్తోంది. ఏపీలో సినీ పరిశ్రమని అభివృద్ది చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా టాలీవుడ్ కి సీఎం జగన్ వరాలు కురిపించే అవకాశాలున్నాయని సమాచారమ్.