కరోనా కేసులు.. నెం.1 స్థానంలోకి భారత్ ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నదే నిజం కానుందా ? కరోనా కేసులు, మరణాల లిస్టులో భారత్ టాప్ ప్లేసులోకి చేరనుందా ? అంటే.. అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల లిస్టులో భారత్ ఐదో స్థానంలోకి ఎగబాకింది. శనివారం ఆరో స్థానంలో ఉన్న భారత్ ఒక్కరోజులే ఒక స్థానం ఎగబాకింది. ఇక టాప్ స్థానంలోకి రావడానికి ఎక్కువరోజులు పట్టడని దేశంలో రోజువారీగా భారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యని చూస్తే అర్థమవుతోంది.

శనివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,46,585కు చేరాయి. మొత్తం 6,895 మంది ప్రాణాలు కోల్పోగా.. 1,18,918 మంది కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్యలో శనివారం ఉదయానికి ఇటలీని వెనక్కి నెట్టిన భారత్‌.. తాజాగా స్పెయిన్‌ను కూడా దాటి ప్రపంచంలోనే అత్యధికంగా కేసులున్న దేశంగా నిలిచిందని జాన్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం తెలిపింది.