మానసిక సమస్యలతో బాధపడుతున్న శృతి

హీరోయిన్ శృతి హాసని మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా శృతినే తెలిపింది. కరోనా లాక్‌డౌన్ తో ఇంట్లోనే ఉంటున్న శృతి ఓ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. పర్సనల్, సినిమాలకి సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘గత మూడేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఉన్నా. అలాగని బాధపడటం లేదు. ఇందుకోసం చికిత్స తీసుకుంటున్నా. ధ్యానం, యోగా, వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నా. పుస్తకాలను చదవడం, రాయడం, సంగీతం వినడం వంటివి కూడా చేస్తున్నా. మానసిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నా’నని తెలిపింది.

ఇక వ్యక్తిగత కారణాలతో కొంతకాలంగా సినిమాలకి దూరమైన శృతిహాసన్.. క్రాక్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. బలుపు కాంబోలో వస్తున్న చిత్రమిది. గోపీచంద్ మలినేని దర్శకుడు. రవితేజ-శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ సినిమా కోసం శృతి హాసన్ పేరు వినిపించింది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.