క్రేజీవాల్’లో కరోనా కలవరం

ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ అస్వస్థతకి గురయ్యారు. ఆయన ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో సమావేశాలన్నీ రద్దుచేసుకున్న కేజ్రీవాల్ స్వీయనిర్బంధంలో ఉండిపోయారు.

జ్వరం, గొంతు నొప్పి కరోనా లక్షణాలే కావడంతో క్రేజీవాల్ కి రేపు కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, ఢిల్లీలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 28,936 పాజిటివ్‌ కేసులు బయటపడగా వీరిలో 812 మంది మృత్యువాతపడ్డారు.