కరోనాపై విజయం.. ప్రధాన మంత్రి డ్యాన్సులే  డాన్సులు !

కరోనాపై కివీస్ విజయం సాధించింది. న్యూజిలాండ్ లో సోమవారం చిట్టచివరి కరోనాపేషెంట్‌ను డిశ్చార్జి చేశారు. దీంతో కరోనా ఫ్రీ కివీస్ అయింది. ఈ నేపథ్యంలో ఆ దేశ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఆనందంలో కొద్దిసేపు డ్యాన్స్ కూడా చేశానని ఆమె తెలిపారు.

5 మిలియన్లకు పైగా జనాభా కలిగిన న్యూజీలాండ్‌లో కేవలం 1,154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 22 మంది మృత్యువాత పడ్డారు. దేశ సరిహద్దుల్లో కఠినంగా వ్యవహరించడం, ప్రజలు భౌతిక దూరం పాటించడం, అవసరమైన మేరకే ఇండ్ల నుంచి బయటకు రావడం వంటి చర్యల ద్వారా కరోనా వైరస్‌పై విజయం సాధించగలిగామని ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్‌ స్థానిక టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు.