ఒక్కరోజులో 331 మంది మృతి

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లోనే అత్యధికంగా 9987 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్‌ ప్రవేశించిన అనంతరం ఒకేరోజు అత్యధిక కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 331మంది మృత్యువాతపడ్డారు. ఒకేరోజు ఈ స్థాయిలో మరణాలు సంభవించడం కూడా ఇదే తొలిసారి.

కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 2,66,598కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 7466మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 1,29,215 మంది కోలుకోగా మరో 1,29,917 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక తీవ్రత కొనసాగుతున్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. మరణాల సంఖ్యలో మాత్రం 12వ స్థానంలో కొనసాగుతోంది.