క్రేజీవాల్’కు కరోనా నెగటివ్

గత మూడు రోజులుగా ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ జ్వరం, గొంతునొప్పి, తదితర కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతుండటంతో సోమవారం ఆయన స్వీయనిర్భంధంలోకి వెళ్లారు. కేజ్రీవాల్‌కు డయాబెటీస్‌ కూడా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షల్లో నెగటివ్ అని నిర్ధారణ అయింది.

దేశరాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా తీవ్రత పెరగడంతో, సమూహ వ్యాప్తి ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీనిపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా స్పష్టత ఇచ్చారు. దిల్లీలో సమూహ వ్యాప్తి లేనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. మంగళవారం నాటికి రాష్ట్రంలో 29,943 కేసులు నమోదుకాగా, వారిలో ఇప్పటివరకు 874 మంది మృత్యువాతపడ్డారు.