సీఎం జగన్’తో సినీ ప్రముఖుల భేటీ.. పోటోలు !


ఏపీ సీఎం జగన్ తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం అయ్యారు. ముందే ఖరారైన షెడ్యూల్ ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3గంటలకి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ తో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు.

సినీ పరిశ్రమ అభివృద్ధి, సమస్యలు, పరిష్కారంపై సీఎంతో చర్చించారు. సీఎం జగన్ ని కలిసినవారిలో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, దర్శకుడు రాజమౌళి, నిర్మాతలు సురేశ్‌బాబు, సి.కల్యాణ్‌, దిల్‌రాజు తదిరులు ఉన్నారు.

ఈ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. సమావేశంలో సాదాసీదా చర్చలు జరిగాయా ? లేదంటే సీఎం జగన్ నుంచి ఊహించని హామీలు ఏమైనా వచ్చాయా ?? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం సీఎం జగన్ తో సినీ ప్రముఖుల సమావేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.