ఏపీలో పది పరీక్షలు రద్దు లేదు

కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నల్స్ వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులకి గ్రేడ్స్ కేటాయిస్తామని తెలిపింది. తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని భావించారు. కానీ పది పరీక్షలని నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు.

జులై 10 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయడంతో ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం పది పరీక్షలని నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది.