TSలో 191 కొత్త కేసులు.. 8 మంది మృతి !

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా మరో 191 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,111కి చేరింది. గడిచిన 24 గంటల్లో 8 మంది కరోనాతో మృతి చెందగా.. ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 156కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 143 మందికి కరోనా సోకినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో 11 చొప్పున కరోనా బారినపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో 8, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో 3 చొప్పున, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌ జిల్లాల్లో 2 చొప్పున కరోనా బారినపడ్డారు. నిజామాబాద్‌, వికారాబాద్‌, నల్గొండ, సిద్దిపేట జిల్లాలలో ఒక్కొక్కరికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,817 మంది కరోనా నుంచి కోలుకోగా.. 2,138 మంది చికిత్స పొందుతున్నారు.