సీఎం జగన్’తో సినీ ప్రముఖుల భేటీపై బాలయ్య షాకింగ్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో మంగళవారం టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయ్యారు. ఇండస్ట్రీ సమస్యలని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టాలీవుడ్ సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చారు. అదే విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఎవరైనా స్టూడియోస్ నిర్మించుకోవాలనుకుంటే చాలా తక్కువ ధరకే భూమిని ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే సొంత ఇళ్లకోసం భూమిని ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఈ భేటీపై బాలయ్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

“ముఖ్యమంత్రితో ఓ వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. దానికి ఎవరెవర్ని తీసుకురావాలో రాసిపెట్టారు. ఓ వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇచ్చినప్పుడు నేనెందుకు వెళ్తాను. ఇండస్ట్రీ ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. నేను బాగా హర్ట్ అయ్యాను. అయినప్పటికీ ఆలోచించి చెబుతా అన్నాను. అంతలోనే వాళ్లకు వాళ్లే ప్రకటించుకున్నారు. బర్త్ డే వేడుకల సందర్భంగా బాలయ్య రానన్నారని వాళ్లే చెప్పుకున్నారు. ఆ ప్రకటనతో నాకు సంబంధం లేదు. నేను చెప్పినట్టు వేరే వాళ్లు చెప్పేశారు. ఆ తర్వాత నా కోసం ప్రయత్నించారు. ఇక నేను స్పందించలేదు” అని తెలిపారు. అంతేకాదు. ఇండస్ట్రీలో గ్రూపులు ఎక్కువయ్యాయని, మరీ ముఖ్యంగా కుల సమీకరణాలు పెరిగిపోయాయని బాలయ్య విమర్శించారు.