నందమూరి మల్టీస్టారర్’కు బాలయ్య గ్రీన్ సిగ్నల్


నందమూరి అభిమానులకి గుడ్ న్యూస్. నందమూరి మల్టీస్టారర్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. జూ. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లతో కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నా. మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తామన్నారు. ఈరోజు బాలయ్య 60వ పుట్టినరోజు వేడుకని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నందమూరి మల్టీస్టారర్ పై స్పందించారు.

నందమూరి మల్టీస్టారర్ లో నటించేందుకు నేను సిద్ధం. కావాల్సింది మంచి కథే. ‘షోలో’ మాదిరిగా అద్భుతమైన కథ కావాలన్నారు. ‘మనం’ మల్టీస్టారర్ అక్కినేని ఫ్యామిలీకి మరుపురానీ సినిమాగా మిగిలిపోయింది. మనం మాదిరిగానే దగ్గుపాటి ఫ్యామిలీ కూడా ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలనే ప్రయత్నాల్లో ఉంది. వెంకీ, రానా, నాగచైతన్య కలిసి తెరనుపంచుకోవాలని చూస్తున్నారు. మంచి కథ కోసం సురేష్ బాబు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. అదే విధంగా నందమూరి అభిమానులు కూడా బాలయ్య, తారక్, కల్యాణ్ రామ్ కలిసి నటిస్తే చూడాలని భావిస్తున్నారు. ఇందుకు బాలయ్య ఓకే అన్నారు. ఇక కావాల్సిందల్లా కథే. మరీ.. ఆ కథని ఏ దర్శకుడు రెడీ చేస్తారు ? అన్నది వేచి చూడాల్సిందే.