నాగబాబు సంచలన ట్విట్ : వారికి జగనే కరెక్ట్ 

మెగా బ్రదర్ నాగబాబు మరోసారి సంచలన ట్విట్స్ చేశారు. ఆయన టార్గెట్ ఎవరు ? అన్నది స్పష్టత లేదు. కానీ ఈ సారి టీడీపీ అనుకూల మీడియాపై పడిపోయాడు నాగబాబు. టీడీపీ జెండా, అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు వార్త ఛానెల్స్ ని చూస్తే ముచ్చేటిస్తుందని మొదలుపెట్టిన నాగబాబు.. ఆ ఛానెల్స్ బాబుపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటాయ్. ఇలాంటి వారికి సీఎం జగనే కరెక్ట్ అనిపిస్తోందంటూ వరుస ట్విట్స్ చేశారు.

“టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని,టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం, మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం, మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం, మనబాబుకి ఉపయోగపడినంత కాలం. ఓడ మల్లయ్య అని.. బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ,బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా. పత్రికల స్పిరిట్ అంటే.. శభాష్…(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి)”