వైసీపీలో చేరిన శిద్ధా రాఘవరావు


టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు రాఘవరావు తనయుడు సుధీర్ తో కలిసి వైసీపీలో చేరారు. వీరికి అమరావతి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శిద్దా తెదేపాని విడిచి వైసీపీలో చేరబోతున్నారని ఒకట్రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా శిద్దా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీలో చేరిన సందర్భంగా శిద్ధా రాఘవరావు మాట్లాడుతూ.. “సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలోనే వైకాపాలో చేరాను. ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏడాదిగా జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. పేద, మధ్య తరగతి వారికి భవిష్యత్తులోనూ అనేక పథకాలు అమలు చేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రజల్లో చెరగతి ముద్ర వేసుకోవాలని కోరుకుంటున్నా”నన్నారు.