టీడీపీ ఖాళీ కాబోతుంది

తెదేపా నుంచి వైసీపీలోకి భారీగా వలసలు జరగనున్నాయ్. 10-12 మంది తెదేపా ఎమ్మెల్యేలు వైసీపీలో చేరబోతున్నారనే.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బాంబు పేల్చారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాదు.. తెదేపా సీనియర్ నేతలు పార్టీ మారడానికి రెడీ అవుతున్నారు. ఎవ్వరికి వారే వైసీపీతో చర్చలు జరుపుతున్నారని తెలిపారు.

అదేసమయంలో తెదేపా అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు కరణం. చంద్రబాబు నాయుడు తనను ఎంతో మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుమారుడు నారా లోకేష్‌ది తన గురించి మాట్లాడే స్థాయి కాదని చురకలంటించారు. పార్టీలో సీనియర్లకు కనీసం గౌరవం దక్కడం లేదన్నారు. అందుకే సీనియర్లు తెదేపాని వీడబోతున్నారని తెలిపారు.