అలర్ట్ : తెలంగాణకు భారీ వర్షాలు


వానాకాలం మొదలైపోయింది. నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర వరకు చేరుకున్నాయ్. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో తెలంగాణ, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అరేబియా సముద్రంలోకి మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

అంతే కాకుండా ఏపీ, ఒడిశా, చత్తీస్ గఢ్, మేఘాలయ రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు వర్షాకాలం రాక.. వాతావరణం చల్లబడటంతో దేశంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.