తెరాస మహిళా ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం

తెలంగాణలో ప్రజా ప్రతినిధులు వరుసగా కరోనా బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో తెరాస మహిళా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి కూడా కరోనా బారినపడ్డారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి స్పందించారు. ‘తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నా. తనపై తప్పుడు ప్రచారం జరుగుతుంది’ అని క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మెదక్‌ పోలీసు స్టేషన్‌లో తెరాస నేతలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తప్పుడు పోస్టు చేసిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ పోస్టును మెదక్‌ జిల్లా రాజుపల్లికి చెందిన నాగరాజు అనే వ్యక్తి వాట్సాప్‌ గ్రూపుల్లో ఫార్వర్డ్‌ చేసినట్లు గుర్తించారు. ఆయన్ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.