బాలీవుడ్‌లో బంధుప్రీతిపై పాయల్ కామెంట్

యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యని బాలీవుడ్ జీర్ణించుకోలేకపోతోంది. సుశాంత్ ని బాలీవుడ్ నే చంపేసిందని హీరోయిన్ కంగనా సంచలన కామెంట్స్ చేశారు. బాలీవుడ్ బంధు ప్రీతి ఎక్కువ. ఎలాంటి నేపథ్యం లేని వారిని ఇక్కడ తొక్కేస్తారు. సుశాంత్ విషయంలో అదే జరిగింది. ఆయనకి అవార్డులు రాకుండా అడ్డుకున్నారని కంగనా విమర్శించారు. కంగనా కామెంట్స్ కి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సపోర్ట్ చేశారు. టాలీవుడ్ నుంచి కూడా కంగనాకి సపోర్ట్ లభిస్తోంది.

బాలీవుడ్ లో బంధు ప్రీతిపై తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ స్పందించారు. చిత్ర పరిశ్రమలో చీకటి కోణం కూడా ఉంది. మొదటిది.. నెపోటిజం.. ఇది బాలీవుడ్‌ నరనరాల్లో ఇంకిపోయింది, రెండు.. ఈ ఆటకు అదృష్టం అనే పేరు పెడతారు, మూడు.. అభద్రతాభావం కల్పిస్తారు’. ‘అక్కడి వారు నన్ను కూడా దూరం పెట్టారు. ‘పాయల్‌ నువ్వు దీనికి సరిపోవు’ అంటూ నా స్థానంలో మరొకర్ని తీసుకున్నప్పుడు.. నా గుండె పగిలింది. కుంగిపోయా.. అంతేకానీ ఆత్మహత్య చేసుకోవాలి అనుకోలేదని పాయల్ చెప్పుకొచ్చింది.