ఏపీలో 275 కొత్త కేసులు

ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజు నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 275 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,555కు చేరినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.

కరోనా మహమ్మారి‌ కారణంగా గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 90 మంది మరణించారు. అయితే కరోనా నుంచి కోలుకొని 2,906 మంది డిశ్చార్జ్‌ కాగా.. ప్రస్తుతం 2,559 యాక్టివ్‌ కేసులున్నాయి.