తమిళనాడులో ఒక్కరోజులోనే 2115 కేసులు

తమిళనాడులో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రోజువారీగా నమోదవుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలల్లో నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో తమిళనాడులో ఏకంగా 2115 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో తమిళనాడులో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54449కి చేరాయి.

మరోవైపు కరోనాని కంట్రోల్ చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. కరోనా ప్రభావం అధికంగా ఉన్న నాలుగు ప్రాంతాల్లో పూర్తిగా లాక్‌డౌన్ ని విధించారు. అయినా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం.. ఒక్కరోజే 2115 కొత్త కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.