ఆరోగ్య మంత్రి ఆరోగ్యం విషమం

దేశంలో కరోనా విజృంభిస్తోంది. సామాన్య ప్రజలే కాదు.. ప్రజా ప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. కరోనా బారిన పడిన ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ పరిస్థితి విషమించినట్టు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు న్యుమోనియా కూడా జతకావడంతో శ్వాసపరమైన ఇబ్బందులు పెరిగాయి. దీంతో ఆయనకు ప్లాస్మా థెరపీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.

తీవ్ర జ్వరం, శ్వాసపరమైన ఇబ్బందులతో ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ఆయనను తరలించారు. మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చింది. బుధవారం మరోసారి టెస్ట్ చేయగా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయనే స్వయంగా  ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కృత్రిమ శ్వాస అందిస్తున్నామని వైద్యులు తెలిపారు.