పవన్-క్రిష్ సినిమా.. ఓ షాకింగ్ న్యూస్ !

‘వకీల్ సాబ్’ సినిమాతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పవన్ సినిమా ఉండనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ లో పవన్ పాల్గొనాల్సి ఉంది. ఇంతలో కరోనా ప్రభావంతో షూటింగ్స్ కి బ్రేక్ పడింది.

అయితే ఈ గ్యాప్ లో పవన్-క్రిష్ సినిమా కోసం ఓ కాస్ట్లీ సెట్ వేశారు. నగరంలోని అల్యూమినియం కర్మాగారంలో భారీ సెట్‌ను నిర్మించారు. సహజంగా సముద్రాన్ని తలపించేలా ఓ సెట్ తో పాటు ఓడ సెట్ కూడా వేశారరు. ఎన్నో ప్రత్యేకలతో సెట్‌ని రూపొందించినట్టు తెలుస్తుండగా, రీసెంట్‌గా కురిసిన భారీ వర్షం వలన సెట్ పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. దీంతో చిత్రబృందానికి భారీ నష్టం కలుగనుందని తెలుస్తోంది.