హరీష్ లాజిక్’తో కొట్టారు


కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. తెలంగాణలో కరోనాని కంట్రోల్ చేయడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. నడ్డా వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులు, ప్రాణాలను లెక్క చేయకుండా కరోనాపై పోరాడుతున్న వైద్యులు ఒక్కటేనని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే అన్నారు. దేశ రక్షణ విషంలో ప్రభుత్వాలపై విమర్శలు చేయడం మంచి కాదని మీరే అంటారు. మీరే అలాంటి విమర్శలు చేస్తారని హరీష్ లాజిక్ తో కొట్టారు. అంతేకాదు.. నడ్డాకి హరీష్ ఓ విజ్ఝప్తి చేశారు.

‘మానవాళి మనుగడకే సవాలుగా మారిన కరోనా విషయంలో రాజకీయాలు చేయడం, దేశ భద్రత విషయంలో చులకనగా మాట్లడడంతో సమానం. దయచేసి ఇది గుర్తుంచుకోవాలని జేపీ నడ్డాను కోరుతున్నా’నని హరీష్ అన్నారు. కరోనా విషయంలో రాష్ట్రాలను విమర్శించడం రాజనీతి అవుతుందా? దేశానికి వైద్యశాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న మీరే వైద్యులు చేస్తున్న కృషిని తక్కువ చేసి చూపడం సబబా ?? అని ప్రశ్నించారు.