ఒక్కరోజులోనే 445 కరోనా మరణాలు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 14,821 కరోణా పాజిటివ్ కేసులు నమోదయ్యాయ్. దీంతో దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 4,25,282కు చేరింది.

వీరిలో మంది 2,37,195 కోలుకొని ఇంటికి చేరుకున్నారు. నిన్న ఒక్కరోజే 9,440 మంది కోలుకున్నారు. 1,75,387 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొవిడ్‌ దెబ్బకు దేశవ్యాప్తంగా 24 గంటల్లో 445 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 13,699కి పెరిగింది.

తెలంగాణలోనూ ఆదివారం రికార్డ్ స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయ్. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 730 కొత్త కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది.  ఒక్క జీహెచ్ ఎంసీ పరిధితిలోనే 659 కేసులు నమోదయ్యాయ్. ఇతర జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయ్. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,802కి చేరింది. ఆదివారం కరోనాతో 7గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 210కి చేరింది.