తెలంగాణలో కరోనా చేయి దాటిపోతుందా ?

తెలంగాణలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా ప్రభావం అధికంగా ఉంది. గడిచిన 24గంటల్లో తెలంగాణలో 872 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ ఎంసీ పరిధిలోనే 713 కేసులు  నమోదయ్యాయ్.

మొత్తం 3,189 శాంపిల్స్‌ను పరీక్షించగా 872 కేసులు నమోదయ్యాయ్. అంటే.. టెస్టుల సంఖ్యకు నమోదవుతున్న కేసుల సంఖ్య 3:1 గా ఉంది. ఈ లెక్కన మరోవారం రోజుల్లోనే తెలంగాణలో ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య 2వేలకి పైగానే ఉంటాయని అంచనా. ఇక సోమవారం కరోనాతో తెలంగాణలో 7గురు మృతి చెందారు.

రాష్ట్రంలో మరణాల సంఖ్య 217కి చేరింది. సోమవారం మరో 274మంది కోలుకోవడంతో ఇప్పటివరకు డిశ్చార్జి అయినవారి సంఖ్య 4005కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4452 మంది చికిత్స పొందుతున్నారు.